ఓం శ్రీ వినాయకాయనమః

Tuesday, August 30, 2011

సత్యప్రమాణాల దేవుడు*శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి

సత్యప్రమాణాల దేవునిగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా ఉన్న సిద్ధి వినాయక దేవస్థానాల్లో ఎంతో పేరెన్నికగన్నది. కోరిన కోర్కెలు తీర్చే స్వయంభువుగా కాణిపాకం వినాయకుడు ప్రసిద్దిగాంచారు. ఇరు వర్గాలు, ఇద్దరు వ్యక్తులు మద్యన ఏదైనా సమస్య వస్తే స్వామి ముందు ప్రమాణం చేస్తే అదే తుది నిర్ణయం. ఇక్కడ వినాయకస్వామి వారే న్యాయ నిర్ణేత అని భక్తుల నమ్మకం.

Kanipakam_Vinayaka 

ప్రతి ఏటా వినాయక ప్ర తిమ పెరుగుతూ భక్తుల ను అలరిస్తోంది. చెక్కు చెదరని శిల్పసౌందర్యం కాణిపాకానికే సొం తం. పర్యాటకులకు కనువిందు చేసే పుణ్యక్షేత్రంగా ప్రసిద్దిగాంచిన కాణిపాక క్షేత్రం భక్తుల రాకపోకలతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు అత్యధికంగా స్వామివారి సేవలోపాల్గొం టారు. వచ్చిన భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఆలయ అధికారులు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. భక్తుల విడిది, ఉచిత భోజనం, కాలక్షేపం కోసం మహాగణపతి స్తోత్రం లాంటి వసతులన్ని సమకూర్చారు.

కోర్కెలు తీర్చే స్వామి...
ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది. కోర్కెలు తీర్చే దేవతగానో, మొక్కులు తీర్చే దేవుడుగానో ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిథ్యం వహిం చడం అరుదు. అలాంటి ఆలయాల్లో చిత్తూరు పట్టాణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదానది తీరంలో కాణిపాకం వెలసిన కాణిపాక క్షేత్రం ఒకటి.

కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయ కస్వామి దేవస్థానంలో ఒక వైపు భక్తులకు వరాలు ఇచ్చే దేవుడుగా, మరోవైపు ప్రమాణాలతో సత్య శోధన చేసి దేవదేవుని క్షేత్రంగా ప్రసిద్ది గాంచింది. కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామి దర్శనా ర్థం నిత్యం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారు విశేషంగా ఆకర్షిస్తూ భక్తుల పాలిట కొంగుబంగారమై ప్రత్యేకత సంతరించుకున్నారు.

ఆలయ చరిత్ర...
ఈ ఆలయాని
కి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. తొలుత ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారు. ఇక్కడ జన్మతః మూగ, చెవిటి, గుడ్డి అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకొని జీవనం గడిపేవారు. వీరు ఒకరోజు ఏతం తో నీటిని తోడుతూ పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవ డంతో ఏతం బాన బావి అడుగుకు తగిలి ఖంగుమని శబ్ధం చేసిం ది. చూస్తే వినాయకుడి విగ్రహం కనపడింది. తల వెనుక భాగానికి ఏతం తగలడంతో అక్కడ ఊటలాగా రక్తం రావడం ప్రారంభమైంది.

kanipakam1 

వినాయకుని రక్తజలంతో వారి శరీరాలు ప్రక్షాళన అయ్యాయని ప్రతీతి. దీంతో మూగ వానికి మాటలు వచ్చాయి. చెవిటి వారికి శ్రా వ్యంగా వినపడింది. గుడ్డివానికి చూపు వచ్చింది. దీంతో ముగ్గురు సోదరులు ఆ గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామ ప్రజలు వచ్చి బావిలో స్వామివారికి పూజలు నిర్వహించారు. తరువాత ఎంత తవ్వినా స్వామి వారి విగ్రహం చివరిభాగాన్ని కనుక్కొలేకపోయా రు. అందు చేత విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయసాగారు.

భక్తులు వినాయకునికి నారికేళ ఫలాలు ఇష్టమని ఒక్క క్షణం నిలప కుండా కొబ్బరి కాయలు కొట్టసాగారు. స్వచ్చమైన కొబ్బరినీళ్ళతో ఆ బావి నుంచి నీరు పొంగి ప్రవహించింది. బావి నుంచి పొంగి పొరలిన కొబ్బరి నీళ్ళు కాణిమాగాణి అంతా పాకింది. కాణి అనగా ఎకరా పాతికనేల. అలా ఎకరానేల కొబ్బరి నీళ్ళు పాకిన ఆ ప్రాంతా న్ని ‘కాణేపాకం’గా పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా అది ‘కాణిపాకం’ పేరు మారింది.

బహుదానది పేరూ చారిత్రకమే...
స్వామివారు ఆలయ సమీపంలో వెలసి ఉన్న బహుదానదికి కూడా ఆ పేరు రావడానికి మరో కథ ప్రచారంలో ఉంది. కాణిపాకం స్వ యంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారిని దర్శించుకునేందుకు శంఖుడు, లిఖుతుడి అనే ఇద్దరు సోదరులు కాలినడకన బయలు దేరారు. నడకతో అలిసిపోయిన వారు ఒక మామిడి చెట్టు కింద మిశ్రయించారు. ఆకలితో ఉన్న లిఖుతుడు అన్నమాటను పెడచెవి న పెట్టి మామిడి పండు కోసుకొని తిన్నాడు. ఈ విషయం తెలిసిన రాజు అతని రెండు చేతులను ఖండించి వేయించాడు. దీంతో దుఖఃసాగరంలో మునిగిన ఆ సోదరులు ఆలయ సమీపంలో ఓ కొలనులో మునగడంతో లిఖితునికి చేతులు వచ్చాయి. చేతులు ప్రసాదించిన తీర్ధం కావడంతో దానిని ‘బహుదానది’ అన్న పేరు స్ధిరపడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

శివ, వైష్ణవ క్షేత్రం...
కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రాల నిలయం, శ్రీ స్వయంభు వరసిద్ది వినాయకస్వామితో పాటు మురగ దాంబిక సమేత శ్రీమణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీవరదరాజులు స్వామి ఆలయం, శ్రీవీరాంజనే యస్వామి ఆలయం, నవగ్రహాల యం ఉన్నాయి. శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాం గణంలో ఉండడంతో కాణిపాకక్షే తాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా పిలుస్తారు.

ప్రమాణాలకు నెలవు - స్వామివారి కొలువు...
kanipakam 

వివాదాలను, సవాళ్ళను, ప్రతి సవాళ్ళను పరీక్షించుకునేందుకు ప్రజలు చేసే ప్రమాణాలకు కాణి పాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి ఆలయం ప్రధాన స్దావరంగా నిలు స్తోంది. దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకు డుగా కీర్తి గడించిన స్వామి ఎదుట సత్యప్రమాణం చేస్తే తప్పుడు ప్రమాణం చేసిన వ్యక్తికి ప్రతిఫలం అనుభవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ది చెందిం ది. రాజకీయ ఆరోపణలు నుంచి తేలికపాటి ఆరోపణలు వరకు కాణిపాకం ఆలయంలో శ్రీవినా యకస్వామి ముందు సత్య ప్రమ మాణం చేయడానికి కోరుకోవడం ఆనవాయితీగా మారింది.

ఈ కాణి పాకం ఆలయంలో ప్రతిరోజు సాయంకాలం 5:30 నుంచి 6 గంటల వరకు తప్పు చేసిన వారు, చేయని వారు ఇద్దరు 5116 రూపాయలు చెల్లించి ఇద్దరే స్వామివారి ముందు వెళ్ళి సత్య ప్రమాణం చేస్తుంటారు. ఇందులో తప్పుడు సత్యప్రమా ణం చేయదలచిన వారు వెనుకడుగు వేస్తారు. ఇక్కడ ప్రమాణం చేస్తే సమస్య పరిష్కామైనట్లేనని ప్రజల నమ్మకం. గతంలో న్యాయస్థానా లు కూడా కాణిపాకంలో చేసిన సత్యప్రమాణాలకు ప్రధాన్యత ఇచ్చేవి.

వరాల మారాజు...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి భక్తులకు వరాల నిచ్చే మారాజుగా భక్తులచే కొని యాడబడుతున్నాడు. గ్రహపీడ తులు, దీర్ఘకాలిక రోగగ్రస్థులు, వ్యసనపరులు, వివాహం కాని వారు, పలు రకాల సమస్యలు ఉన్న భక్తులు ఇక్కడ మొక్కుకుంటే వారి ఇబ్బందులు తొలగడంతో పా టు ప్రశాంత జీవనం దొరుకుతుం దని భక్తుల నమ్మకం.

10 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారి దర్శన అనంతరం... 10 కి.మీ దూరం లో వెలసిన అర్ధగిరి శ్రీవీరాంజనే య స్వామివారి సందర్శనార్ధమై పలువురు భక్తులు తరలివెళ్ళడం ఆనవాయితీగా మారింది. చిత్తూ రు నుంచి ప్రతి అర్ధగంటకు ఇక్క డికి ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు.

అర్ధగంటకో ఆర్టీసి బస్సు...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయక స్వామివారి సందర్శనార్థమై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి వారు చిత్తూరు నుంచి కాణిపాకం వరకు ప్రతి పది నిమిషాలకొక్క ఆర్టీసి బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అదే విధంగా తిరుపతి నుంచి కాణిపాకం వరకు ప్రతి అర్థగంటకొక్క ఆర్టీసి బస్సు సర్వీసు కలదు. వేలూరు (బంగారుగుడి), బెంగుళూరు, నెల్లూరు, హైదరాబాద్‌లకు కూడా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.

నానాటికీ పెరుగుతున్న విగ్రహానికి కవచాలే నిదర్శనం...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారని భక్తుల నమ్మకం. దీనిని స్వామివారి కవచాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లి గ్రామానికి చెందిన బెజవాడ సిద్దయ్యనాయుడు, లక్ష్మయ్య దంపతులు స్వామివారికి చేయించిన వెండి కవచం నేడు స్వామివారికి సరిపోవడంలేదు. స్వామివారు ఆవిర్భవించినపుడు కనిపించిన బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామివారు పెరుగుతున్నారనడానికి నిదర్శనం. అందుకు స్వామివారు స్వయంభువునిగా ఖ్యాతిపొందారు.


- టి.గిరి, SuryDaily,
ఐరాల మండలం, చిత్తూరు జిల్లా

No comments: